Friday, January 22, 2010

తెలంగాణ వచ్చాక ?

ఈ మధ్య మా వూర్లో నే తెలంగాణా వాళ్ళ సభ జరిగింది కొంత మంది మేతావులు (చందాలు మెయ్యడమే వ్రుతిగా వున్న కళాకారులు)తెలంగాణా వచ్చాక ఈ ఆధ్రోళ్ళ్ ని వెళ్ళ గొడదాం అడ్డొస్తే పీక కోస్తం అంటూ ఒకటే వాగుడు వూర్లో వున్న ఒక్క వెధవ నోరెత్తితే వట్టు ప్రతి ఇంటినుంచీ రియల్ ఎస్టే ట్లో కోట్లు సంపాదించిన తెలంగాణా వాళ్ళే ఇప్పుడు తరిమేస్తాం చంపుతాం ఆంటూ జనాలని భయభ్రాంతులకి గురిచేస్థున్నారు. జీతం రాళ్ళు వెనకేసుకుని ఏదో గూడు కొసం వీళ్ళ చేతులలో అలవిమాలిన ధనం పోసాము ఇప్పుడు డబ్బు మదంతో రెచ్చి పోతున్నారు. పోయిన వారం లో కూడా ఒక సమావేశం లో కొందరు మిత్రులు( అందరూ తెలంగాణా వాళ్ళే ) తో జరిగిన సంభాషణ
అసలు మీ నాయకులు ఇక్కడి వాళ్ళు ఇక్కడే వుంటారు అని వాళ్లకి రక్షణ కల్పిస్తాం అంటూంటే మీరు ఎలా వెళ్ళగొడ్తారు అని అడిగా
వాళ్ల సమాధానం .. ఈ రాజకీయ బాడ్కావుల సంగతి ఎందుకే మేము అమ్మిన భూముల ను తిరిగి లాక్కుంటాం
అదే ఎలా ?
మతకలహాల్లో పాత బస్తీ లో ఎమి జరిగిందో తెలుసా? ఇంటికి ఒక్కళ్ళని వేసేసారు అప్పుడు మన హిందువులంతా లక్ష ల ఖరీదు చేసే ఇళ్ళని వేలకి అమ్మేసుకుని పోయారు మళ్ళి అదే రిపీట్ అవుతుంది కాకపోతే ఈ సారి అంధ్రా వాళ్ళమీద అయ్య దీని బట్టి మనకి తేలేదేమంటే కొటి రూపాయలకు ఎకరం కాడికి అమ్ముకున్న వెధవలంతా ఇప్పుడు వాళ్ళ భూములు తిరిగి ఎలా గుంజాలో ప్లాన్ చేసుకుంటున్నట్టు అర్థం అవుతుంది. కవితమ్మ గారు టీ వీ 9 లో ఇప్పటికే ఒక స్టేట్మెంటు ఇచ్చారు దాని ప్రకారం " ఏ ఉద్యమకారుడికైనా ఒళ్ళుమండి శాంతియుతంగా మీ ఆస్తులు తగలెడితే లేక ఒక పోటు పొడిస్తే అది వాళ్ళ అగ్రహం తెలియజేస్తున్నారు" అనుకోవాలే తప్ప మనని దోచుకోవటానిక్కాదు.వాళ్ళని ఎవరూ కంట్రోలు చెయ్యలేరు ఎగ దొయ్యటమే మా పని తరువాత మేము బాధ్యతవహించం) ఈ అసమర్థుని రాజ్యం లో బతకనీకొచిన ఒక సగటు జీతగాడి వెనుక ఎంత కుట్రలు అప్పనంగా వాడి సర్వస్వం దోచుకుందామని ఎన్ని కుతంత్రాలు
దేవుడా నాకేది ఈ తెలబాన్ల నుంచీ రక్షణ?