Wednesday, June 25, 2008

మానవ మృగాలు

ఈ మధ్య పాఠశాలల్లో పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలా చెప్పాలి టీచర్లు " మీరు చాలా అప్రమత్తంగా వుండాలి ఎందుకంటే మానవ ముఖం తొడుగుకుని కొన్ని మృగాలు సమాజంలో తిరుగుతున్నాయ్ మీరు మీ జాగ్రత్తలో వుండండి"
కాప్రా మునిసిపల్ ఏరియాలో నాలుగు రోజులక్రితం చాక్లెట్లు కొనుక్కోవడనికి ఇంటి ప్రక్కన వున్నషాపుకి వెళ్ళిన ఏడు సంవత్సరాల పాపని కారులో వచ్చిన మూడు మృగాలు కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకుపోయి పాడుచేసేసారు ఆ పసి పాప ఇప్పుడు కోమాలో నే వుంది ఆ పాప బ్రతకాలంటే యుటిరస్ బాగా దెబ్బ తిన్నది తీసివేయాలని డాక్టర్ల మాట.ఆ పాప వున్న పరిస్థితి తలుచుకొంటే మనం సమాజంలోనే వున్నామా అన్న సందేహం కలుగుతుంది.
ఇలాంటి మృగాలని శిక్షించడానికి వురి శిక్ష కన్నా ఇంకా కఠిన మైన వేమన్నా వుం టే బాగుణ్ణు.అరబ్ కంట్రీస్ లో లా గ కంటికి కన్ను లాంటివి మన దేశంలో కుడా పెడితే నే గాని ఇలాంటి దారుణాలు ఆగవు.నేరం చేయ్యాలంటే నే గజ గజ వణికే రోజులు రావాలి.ఇలాంటి వెధవల్ని బహిరంగంగా వురి వేస్తే గానీ పోకిరీ మూకల ఆగడాలు ఆగవు.కానీ మన దేశం లో సాధ్య పడుతుందా ఈ రాజకీయ నాయకులు సాధ్యపడనిస్తారా అన్నదే సందేహం నడుస్తున్న బస్సులో పెట్రోలు పోసి జనాలని అ కారణం గా చంపేసిన వాళ్ళ కే సమాజం నుంచీ బొల్డంత వత్తాసు
వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కాబట్టి వాళ్ళ వురి శిక్ష ని తగ్గిం చాలని.ఎందుకంటే చని పోయింది ఆ కుల సంఘం నాయకుల తల్లో చెల్లో కాదుగానేను తక్కువ కులం వాడిని కాబట్టి లేదా మైనారిటీ వర్గం కాబట్టి నాకు శిక్ష తక్కువ పడుతుంది. లేదా నా వర్గం వాళ్ళు చేసే ఆందోళనకి రాజకీయనాయకులే నన్ను తప్పిస్తారు ( నా వర్గం వాళ్ళ వోట్లా మజాకా)అన్న భావన వున్నంత కాలం ఇలా బజారులో బహిరంగంగా ఆడపిల్లల్ని బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, లేదా కిడ్నాప్లు చెయ్యడం లు జరుగుతూనే వుంటాయి.అందుకే నేరాన్ని నేరం గానే చూడండి. వాడు దళితుడా , వాడు మైనారిటీ యా లాంటి వి చూడొద్దు.కుల సంఘాల అనవసర ఆర్భాటాలకి మద్దత్తు ఇవ్వొద్దు